డెహ్రాడూన్లో ఘోర ప్రమాదం.. అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ దుర్మరణం
- విధి నిర్వహణలో ఆర్మీ నాయక్ రాపేటి పూర్ణచంద్రశేఖర్ కన్నుమూత
- ప్రమాదంలో నాగాలాండ్కు చెందిన మరో సైనికుడు కూడా మరణం
- నెలన్నర క్రితమే కుటుంబాన్ని డెహ్రాడూన్కు మార్చిన పూర్ణచంద్రశేఖర్
- స్వగ్రామం వెంకుపాలెంలో విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు
విధి నిర్వహణలో జరిగిన ఘోర ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన ఓ తెలుగు జవాన్ ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామానికి చెందిన రాపేటి పూర్ణచంద్రశేఖర్ (37) శుక్రవారం రాత్రి డెహ్రాడూన్లో మరణించారు. ఆయన ఆర్మీలో నాయక్గా పనిచేస్తున్నారు. ఈ ఘటన ఆయన స్వగ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శుక్రవారం రాత్రి పూర్ణచంద్రశేఖర్ ట్రక్కులో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక చోట ఆర్చి ఒక్కసారిగా కూలిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో నాగాలాండ్కు చెందిన మరో సైనికుడు కూడా మరణించినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన తీరుపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పూర్ణచంద్రశేఖర్కు భార్య గ్రేసి, ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కేవలం నెలన్నర క్రితమే ఆయన తన కుటుంబాన్ని డెహ్రాడూన్కు తీసుకెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి భీమరశెట్టి రామకృష్ణ వెంకటపాలెంలోని ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ డెహ్రాడూన్ లోని ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. జవాన్ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వార్త తెలియగానే వెంకుపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శుక్రవారం రాత్రి పూర్ణచంద్రశేఖర్ ట్రక్కులో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక చోట ఆర్చి ఒక్కసారిగా కూలిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో నాగాలాండ్కు చెందిన మరో సైనికుడు కూడా మరణించినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన తీరుపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పూర్ణచంద్రశేఖర్కు భార్య గ్రేసి, ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కేవలం నెలన్నర క్రితమే ఆయన తన కుటుంబాన్ని డెహ్రాడూన్కు తీసుకెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి భీమరశెట్టి రామకృష్ణ వెంకటపాలెంలోని ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ డెహ్రాడూన్ లోని ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. జవాన్ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వార్త తెలియగానే వెంకుపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.